మహబూబాబాద్ : ఇప్పటివరకు దళితులను అన్ని విధాల ఆదుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమే
నని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 33 మంది ఎస్సీ లబ్ధిదారులకు 75 గజాల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..75 ఏళ్ల భారత స్వాతంత్రంలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలు దళితులను అన్ని రకాల మోసం చేశాయన్నారు.
కానీ, వారిని ఆదుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. దళితులకు దళిత బంధుతో పథకం అలమలు చేయడంతో వారి సామాజిక స్థితిగతులు మార్పు చెందాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తున్నది కేవలం మన తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి స్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు,తదితరులు పాల్గొన్నారు.