హైదరాబాద్ : యాసంగిలో సాగైన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తిలో నిర్వహించనున్న నియోజకవర్గ ఇన్చార్జీల సన్నాహక సమావేశం స్థలాన్ని మంత్రి పరిశీలించారు. పాలకుర్తి బృందావన్ గార్డెన్స్లో నిర్వహించున్న సమావేశానికి అన్ని మండలాలు, గ్రామాల నుంచి ఇన్చార్జీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు, రైతు సమన్వయ సమితుల బాధ్యులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ పంజాబ్ తరహాలో రాష్ట్రంలోనూ వందశాతం ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని కేంద్రాన్ని కోరారన్నారు. మరో వైపు రైతాంగాన్ని, ఇటు పార్టీ శ్రేణులను, ప్రజలను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.