తిరుమల: తిరుమల భక్తులకు ఉత్తమ సేవలు అందించి వృత్తి నైపుణ్యం కనబరిచిన 15మంది నిఘా, భద్రతా సిబ్బందికి టిటిడి సివిఎస్వో గోపినాథ్జెట్టి బుధవారం మెరిటోరియస్ అవార్డులు అందజేశారు. భక్తులు పోగొట్టుకున్న బంగారు,వెండి వస్తువులను సీసీ టివిల ద్వారా వెతికి ఇవ్వడం, భక్తులు పోగొట్టుకున్నసెల్ఫోన్లు తిరిగి అందించడం తప్పిపోయిన చిన్నపిల్లలు, వృద్ధులను తిరిగి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం,భారీ వర్షాల సమయంలో జిఎన్సి టోల్గేట్,ఘాట్ రోడ్డులో ఉత్తమంగా విధులు నిర్వహించినవారికి ఈ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి విజివో బాలిరెడ్డి, వివిధ సెక్టార్ల ఏవిఎస్వోలు, విఐలు పాల్గొన్నారు.