అమరావతి : కడప శివారులోని పబ్బపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ సతీమణి దుర్మరణం చెందారు. ఇవాళ కడప మెప్మా పీడీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆమె తీవ్రగాయాలతో మృతి చెందింది . మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల శివారులో అర్ధరాత్రి ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుంటూరు నుంచి విశాఖకు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నల్లజర్ల వద్ద అతివేగంగా వచ్చి బోల్తా పడింది . దీంతో బస్సులో ఉన్న 8 మందికి తీవ్రగాయాలు కాగా వీరిని ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు పెట్రోల్ బంక్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాల య్యాయి. వీరిని బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.