హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): వార్షిక, ఇన్స్టంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థులకు రెండో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలనే వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని కాళోజీ నారాయణరావు వైద్య విద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయం సుముఖంగా ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరింది. ఈ నెల 15వ తేదీన జరిగే విచారణ నాటికి వర్సిటీ వైఖరి చెప్పాలని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్ సేన్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.