అమరావతి : కోవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని ఈ ఎన్నికలు పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లమన్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.