విద్యానగర్, డిసెంబర్ 5 : ప్రైవేట్ దవాఖాన లంటేనే జనం భయపడే పరిస్థితుల్లో ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి అవసరమయ్యే మందులను ఇంటికే వెళ్లి ఉచితంగా అందించాలని తాజాగా నిర్ణయించింది. రోజురోజుకూ రోగాల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఆర్థిక భారాన్ని తగ్గించాలని సర్కారు నిర్ణయించింది. ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభు త్వం వైద్య సేవలను అందిస్తున్నది. త్వరలో బీపీ,షుగర్ పేషెంట్లకు నెలకు సరిపడా మందులను అందించనున్నది. ముందుగా 80 ఏండ్లు పైబడిన వారికి ఆశ వర్కర్ల ద్వారా డోర్ డెలివరీ చేయనున్నది. 30 ఏండ్ల వయస్సు వారికి సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 48,258 మందికి ఊరట లభించనున్నది. మందులే గాకుండా బీపీ, షుగర్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉచితంగా చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అంతే కాకుండా మరింత ఆరోగ్యవంతంగా జీవించేందుకు సూచనలు ఇవ్వనున్నారు.
జిల్లాలో 48,258 మందికి లబ్ధి
కామారెడ్డి జిల్లాలో 48,258 మంది షుగర్, బీపీతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. బీపీతో 32,947, షుగర్తో 15,311 మంది బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 10,31, 400 జనాభా ఉండగా 10 సబ్ సెంటర్లు, అందులో 169 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. బీపీ,షుగర్తో బాధపడే వారు రోజూ వైద్యులు సూచించిన మందులు తీసుకుంటారు. ఇప్పు డు సర్కారు తాజా నిర్ణయంతో నెలవారీగా మందుల కో సం ఖర్చు చేసే బాధ తప్పనున్నది. బీపీ, షుగర్ బారిన పడిన రోగులకు డోసు ప్రకారం విడివిడిగా మందుల కిట్ల ను అందించనున్నారు.ఈ నేపథ్యంలో బీపీ, షుగర్ వ్యా ధిగ్రస్తులకు స్థానిక ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేకంగా మందుల కిట్లను అందజేయాలని నిర్ణయించుకున్నది.
పేదలకు మేలు చేసే నిర్ణయం
బీపీ,షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయడంతో పేదలకు మేలు కలుగనున్నది. గ్రామీణ ప్రాంతా ల్లో ఈ వ్యాధిగ్రస్తులు డబ్బులున్నప్పుడే మందులు కొనుగోలు చేయడం, నిత్యం వేసుకోకపోవడంతో దుష్పరిణామాలు కలుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం నెలకు సరిప డా మందులు అందజేయడంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ వ్యాధులు నియంత్రణలో ఉండడంతో ఇతర వ్యాధులు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎన్సీడీ కిట్ల పంపిణీ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సబ్ సెంటర్లో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి టెస్టులు చేయనున్నారు. దీంతో అధికారులు గ్రామ స్థాయి నుంచి సర్వే చేపట్టనున్నారు. వీరందరికీ బీపీ,షుగర్ పరీక్షలతో పాటు క్యాన్సర్ లక్షణాలపై సర్వే కొనసాగనున్నది. ఈ సర్వేకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు డేటా షీట్ అందజేస్తారు. వాటి ఆధారంగా సబ్ సెంటర్లకు వచ్చే వారిని వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యాధికారికి తెలియజేస్తారు.
ఇప్పటికే ఎన్సీడీ పథకం ద్వారా మందులు పంపిణీ చేస్తున్నాం
ఇప్పటికే ఎన్సీడీ పథకం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తు లకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తు న్నాం. మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలో 48,258 మంది బీపీ, షుగర్ పేషెంట్లకు లబ్ధి చేకూరనున్నది. ప్రతి సబ్సెంటర్ నుంచి ఆశ కార్యకర్తలతో వారి పరిధిలో ఉన్న దీర్ఘకాలిక రోగులకు మందు లు ఇవ్వడంతో పాటు అవగాహన కూడా కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం.
-డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి