న్యూస్ నెట్వర్క్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వ ర్ణతాపడం కోసం సోమవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం తరపున రెండో విడతగా రూ.3,00,64,922 నగదు, 200 గ్రాముల బంగారం ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఏస్ ఇంజినీరింగ్ కళాశాల తరపున చైర్మన్ గో పాలకృష్ణ రూ.5 లక్షల చెక్కును స్థానిక ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డికి అందజేశారు. వర్ధమాన్ కాలేజీ తరఫున టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి రూ.5 లక్షలు ఆలయ అధికారులకు అందజేశారు. పీర్జాదిగూడ 11వ డివిజన్కు చెందిన మందడి అ శోక్రెడ్డి రూ.1,05,116, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గోదాల అభిలాష్రెడ్డి తన తండ్రి ఆనంద్రెడ్డి జ్ఞాపకార్థం రూ. 1,16,000 చెక్కును మంత్రికి అందజేశారు. యా దాద్రి ఆలయ రిటైర్డ్ సిబ్బంది, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన హనుమాండ్ల జయమ్మ, రాము లు దంపతులు రూ.1,01,116 చెక్కును ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్బాబుకు అందజేశారు.
యాదాద్రి నర్సన్న సేవలో మల్లారెడ్డి
యాదాద్రికి విరాళాల సేకరణలో మంత్రి మల్లారెడ్డి చురుకుగా వ్యవహరిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సామాన్యులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండువిడతలుగా పదిన్నర కేజీల బంగారం లేదా అందుకు సరిపడ నగదును సేకరించి, యాదాద్రి ఆలయ ఈవోకు అందజేశారు. త్వరలో మూడో విడత విరాళాల సేకరణ చేపడుతామని, మరో కేజీ బంగారం యాదాద్రి లక్ష్మీనర్సింహుడికి సమర్పించుకొంటామని ఆయన పేర్కొన్నారు.