పటాన్చెరు, ఏప్రిల్ 15 : దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలుగా ముద్రపడి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కనుచూపుమేర కానరాక డీలా పడేవారు. యువతరంలో ఎన్నో రకాల ఐడీయాలు ఉన్నా ఆర్థిక మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రతిభ ఉన్న పెట్టుబడి లేక ఆర్థిక విపణిలో వారి సామర్థ్యం నిరూపించుకునే అవకాశాలు ఉండేవి కావు. ఇప్పుడు దళితులకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. సీఎం కేసీఆర్ అందజేస్తున్న దళితబంధు వారికి భరోసా కల్పిస్తున్నది. రూ. 10లక్షల ఆర్థిక సాయం అందుకుంటున్న కుటుంబాల్లో కొత్త ఉత్సాహం వస్తున్నది. పటాన్చెరు నియోజకవర్గంలో మొద టి విడుతగా 100దళితబంధు యూనిట్లు మంజూరు అయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్రెడ్డిల సహకారంతో వంద యూనిట్లు ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనలతో దళితులు వంద యూనిట్లు పెడుతున్నారు. అధికారుల పర్యావేక్ష ణ, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, లబ్ధిదారుల పట్టుదల వెరసి దళితబంధు విజయవంతం అవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
నియోజవకర్గం పరిధిలోని మూడు మండలాల్లో దళితబంధు పథకానికి సంబంధించి వంద యూనిట్ల కోసం మూడు గ్రామాలను ఎంపిక చేశారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ ప్రోటేం చైర్మన్ భూపాల్రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్రెడ్డిలు ఈ నెల 1న దళితబంధు 100 యూనిట్లు లబ్ధిదారులకు అందజేశారు. పటాన్చెరు మండలంలో బచ్చుగూడెంలో 39 యూనిట్లు, గుమ్మడిదల మండలంలోని అంతారంలో 33యూనిట్లు, జిన్నారం మండలం కొడకంచిలో 28యూనిట్లు మంజూరు చేశారు. దళితకుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ప్రభుత్వం ఈ పథకం ద్వారా సాయం చేస్తున్నది. ఈ సొమ్మును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బును లబ్ధిదారులు స్వయం ఉపాధి కల్పించుకునేందుకు ఉపయోగించుకోవాలి. ఇప్పటికే అధికారుల బృందం ఆయా గ్రామాల్లో పర్యటించి దళితబంధు లబ్ధిదారులు పెడుతున్న యూని ట్ల వివరాలు సేకరించారు. సలహాలతో పాటు శిక్షణను సైతం ఇస్తున్నారు. పాల డెయిరీలకు 32, ట్రాన్స్పోర్టు పెట్టుకునేందుకు 39మంది ముందుకొచ్చారు. గొర్రెల పెంపకం కోసం ఐదుగురు, ఫ్యాన్సీషాప్స్, కిరాణ, బ్యూటి పార్లర్, సెంట్రింగ్ మెటీరియల్ దుకాణాలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపారు. కార్పెంటర్, సిమెం ట్ బ్రిక్స్ తయారీ, పౌల్ట్రీ వంటి యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. మార్కెట్లో డిమాండ్ ఉండి ఆర్థిక భరోసా కల్పించే యూనిట్లకు వారు మొగ్గు చూపారు. రూ. 10లక్షలు యూనిట్ను బట్టి అంచలంచెలుగా వస్తాయి.
వాహనాలకు పరిశ్రమల్లో ఉపాధి
ట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టు వెహికల్స్, కార్లు, జేసీబీలు కూడా లబ్ధిదారులు తీసుకున్నారు. వీరికి మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నడపడంలో శిక్షణ ఇవ్వడంతో పాటు లైసెన్స్లు, ఆర్సీలను సమకూర్చుతున్నారు. కార్లు నడిపేవారికి బ్యాడ్జి నంబర్లు కేటాయిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వాహనాలు కొన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి స్థానిక పరిశ్రమల్లో వాహనం నడిపేందుకు ఒప్పించారు. దళితబంధుతో సమకూరిన వాహనం నడిపే లబ్ధిదారుడికి దానితో ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని కూడా కల్పించడం విశేషం. ఎమ్మెల్యే లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. పౌల్ట్రీ వంటి రంగాల్లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయంతో దళిత కుటుంబాల్లో అనందం కనిపిస్తున్నది. పేదరికంతో ఉంటున్న కుటుంబాలకు ఏకంగా రూ. 10లక్షలు ఇచ్చి ప్రోత్సహించడం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో మరిన్ని కొత్త యూనిట్లు మంజూరు కాబోతున్నాయి. దళితుల జీవితాల్లో కొత్త ఆశలు నింపి ఆర్థికంగా ముందుకు నడిపించే పథకానికి అన్ని వర్గాల వారు అభినందిస్తున్నారు.
ప్రపంచంలోనే వినూత్న పథకం..
ప్రపంచంలోనే వినూత్న పథకం దళితబంధు. దశాబ్దాలుగా బాగా వెనుకబడిన కుటుంబాలకు నేరుగా భారీ సొమ్మును అందజేసి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడటం ఎక్కడ నేను చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి వచ్చిన దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. యూనిట్లు ముందు వచ్చిన, మిగిలిన వారికి అంచలంచెలుగా యూనిట్లు కేటాయిస్తాం. వాహనాలు కొన్న వారికి కంపెనీల్లో ఎంగేజ్ చేయించాం. వారి ఉపాధికి కూడా భరోసా ఇచ్చాం. దళితుల్లో పట్టుదల, ప్రతిభ ఎక్కువే. ప్రతి యూనిట్ కొత్తగా, వినూత్నంగా ఉంది. వారంతా విజయం సాధించాలి.
– గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
దళితబంధు అద్భుత పథకం
దళితబంధు అద్భుత పథకం. వినూత్నంగా ఉంది. దళితుల్లో కొత్త చైతన్యం నింపుతున్నది. ప్రతిభ ఉన్నవారికి ఆర్థికసాయం అందుతున్నది. రూ. 10లక్షల సాయంతో వారు ఆర్థికంగా పుంజుకుంటారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తా రు. తెలంగాణ సీఎం కేసీఆర్ దళితులకు చేస్తున్న సాయం వారిలో కొత్త ఆశలు లేపాయి. ఆర్థిక భరోసానే గొప్ప భరోసా. ఈ పథకంలోని లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్న.
– సుప్రజావెంకట్రెడ్డి, జడ్పీటీసీ పటాన్చెరు
డోజర్తో ఆర్థికంగా నిలదొక్కుకుంటా..
దళితబంధులో వచ్చిన రూ. 10లక్షలతో డోజర్ వాహనం తీసుకున్నా. దీంతో నెలకు రూ. 40నుంచి రూ. 60వేలు సంపాదించాలని అనుకుంటున్నా. ఇంతకుముందు కంపెనీలో డ్యూటీ చేస్తే రూ. 15వేల జీతం వచ్చేది. సీఎం కేసీఆర్ సారు చేసిన మేలుతో ఇప్పుడు గొప్పగా బతుకుతా. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సారు చెప్పినట్టు పట్టుదలగా పనిచేసి నాలుగు రూపాయలు సంపాదిస్తా. నా భార్యకు జీరాక్స్ దుకాణం పెట్టిస్తా.
– శ్రీకాంత్, అనంతారం, గుమ్మడిదల
బ్యూటిపార్లర్తో ఓనర్ అవుతా..
నిన్నటిదాక నేను బ్యూటిపార్లర్లో పనిచేసే దాన్ని.. నేటి నుంచి నేనే ఓనర్ని. సీఎం కేసీఆర్ సారు అందజేసిన రూ. 10లక్షలతో ఇంద్రేశంల బ్యూటిపార్లర్ పెట్టుకుంటున్న. పనిలో అనుభవం ఉంది. పార్లర్ బాగా నడుస్తదనే నమ్మకం ఉంది. అధికారులు మం చిగా సహకరించిండ్రు. తెలంగాణ రావడంతోనే మా బతుకులు మారుతున్నాయి.
– లావణ్య, బచ్చుగూడెం