నర్సాపూర్, మార్చి 12 : నర్సాపూర్ పట్టణలోని కేతకి భ్రమరాంబ సమేత శ్రీమరకత మల్లికార్జున స్వామి దేవాలయ వార్షికోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో పండితులు హరిప్రసాద్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా సుప్రభాతసేవ, గణపతి పూజ, దేవతాహ్వానం, అభిషే కం, రుద్రయాగం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. సోమవారం రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి, ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లేశ్యాదవ్ దంపతులు, నాయకులు వెంకటేశ్యాదవ్, సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.
నేడు సోమేశ్వరాలయ వార్షికోత్సవం
చిన్నశంకరంపేట, మార్చి 12 : మండల పరిధిలోని వెంకట్రావ్పల్లి గ్రామంలోని సోమేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవానికి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ నెల 13న నిర్వహించే ఉత్సవాలకు ఆలయ అభివృద్ధి కమి టీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 13న ఉదయం పుణ్యావచనం, గణపతిపూజ, స్థాపితాదేవత ఆవాహనం, నవగ్రహ గణపతి హోమం, పూర్ణాహుతి, ఊరేగింపు, అభిషేక పూజలు, మధ్యాహ్నం సోమేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు.
నేటినుంచి గీతా మందిరంలో వేడుకలు
తూప్రాన్, మార్చి 12 : తూప్రాన్లోని గీతా మందిర ఆల య 14వ వార్షికోత్సవాలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆల య ధర్మకర్తలు తెలిపారు. గణపతి పూజ, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన, యాగశాల ప్రవేశం, యోగినివాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, మండల దేవతాహ్వానం, ప్రధాన కలశస్థాపన, అష్టోత్తర శత కలశస్థాపన, మహాభిషేకం, స్థాపితా దేవత హోమం, గణపతి పురుషసూక్త, రుద్రహోమం, పూర్ణాహుతి, శిఖర, సంప్రోక్షణ, రుక్మిణీకృష్ణ కల్యాణంతో పాటు అన్నదానం నిర్వహిస్తున్నట్లు పూజారి ఉదయ్ శర్మ తెలిపారు. అనంతరం మాధవానంద స్వామి అనుగ్రహభాషనం ఉంటుందన్నారు.