పటాన్చెరు/పటాన్చెరు టౌన్ : ‘మీ భద్రత- మాబాధ్యత’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలకు మం త్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగా ల్లో రాణించి ఆర్థిక స్వాలంబన సాధించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేస్తున్నది తెలిపారు. మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, సీఎం కేసీఆర్ మహి ళా పక్షపాతి అన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి షీ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా రూ.100కోట్లతో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. సుల్తాన్పూర్లో మహిళలే నిర్వహిస్తున్న పారిశ్రామికవాడను ప్రారంభించుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. గతంలో తాగునీటి కోసం కడవలతో కిలోమీటర్ల దూరం వెళ్లేవారని, ఇప్పుడు ఆ బాధలేదన్నారు. ప్రతి గడపకూ నల్లా కనెక్షన్ ఇచ్చి సురక్షిత తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.
కేసీఆర్ కిట్ ద్వారా బంజారాహిల్స్లోని ఇండ్లలో వాడే ఖరీదైన సామగ్రిని నిరుపేదలకు అందజేస్తూ మా తా, శిశు సంరక్షణకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఒకప్పుడు జీతాలు పెంచాలని కోరిన అంగన్వాడీలను గత ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని, టీఆర్ఎస్ సర్కారు వారి జీతాలను పెంచి గౌరవం ఇచ్చిందన్నారు. ఆశవర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి జీతాలు పెంచామన్నారు. దీంతో ప్రజలకు నాణ్యమైన సేవలందుతున్నాయని తెలిపారు. మహిళా సంఘాలకు భారీగా రుణాలు ఇచ్చి, వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మాది అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నామన్నారు. పటాన్చెరులో 350 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంజూరు చేశామన్నారు. మహిళా సంక్షేమం, వైద్యానికి ప్రభు త్వం బడ్జెట్లో పెద్దపీట వేసిందన్నారు.
ఈ సందర్భంగా ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. విద్యార్థినులు బంజారా డ్యాన్స్లు, యువతులు కరాటే విన్యాసాలు, గాయనిలు పాటలతో మహిళా దినోత్సవానికి కొత్త కళను తీసుకొచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నా యకులు వెంకటేశం గౌడ్, కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాద వ్, సింధూ ఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలిత సోమిరెడ్డి, రోజా బాల్రెడ్డి, జడ్పీటీసీ లు సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక, సర్పంచ్లు నీలం మధు ముదిరాజ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, గూడెం మధుసూదన్రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్, విజయ్కుమార్, యంజాల మాధవి, రాణియాదవ్, మహ్మద్ అజ్మే రీ, షకీల్, అజ్మత్, దస్తగిరి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు చెక్కుల అందజేత…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని మహిళా సంఘాలకు రూ. 105.63 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అందజేశారు. స్త్రీ నిధి రుణాలు రూ. 42.53కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మహిళా సంఘాలకు అభినందించారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళలను ఎవరికాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నదన్నారు. చిరు వ్యాపారులు రేపటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఒకరు ఉపాధి పొందతూ మరికొందరికి ఉపాధి కల్పిస్తే సీఎం కేసీఆర్ కోరిక నెరవేరుతుందన్నారు.
ఏటా మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నాం
ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఈ ఏడాది మరింత గొప్పగా మహిళా దినోత్స వం జరుపుతున్నామని తెలిపారు. మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తుండడంతో వారు చక్కటి ప్రతిభను చాటుతున్నారన్నారు. మూడు రోజులుగా ఆటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహిస్తామన్నారు. గతంలో పటాన్చెరు ప్రాంతంలో కాలుష్యం ఉండేదని, ఇక్కడ ఎవరు నివసించేందుకు ఆసక్తి చూపేవారు కాదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పటాన్చెరు ప్రాంతంలో నివసించేందుకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలపై స్పష్టమైన విధానంతో టీఎస్ఐపాస్ను తేవడంతో ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందన్నారు.
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి
సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని, సీఎం కేసీఆర్ పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని శాసన మండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. మహిళలకు టీఆర్ఎస్లో అధిక ప్రాధాన్యత ఉందన్నారు. సగం మంది స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు అయ్యారని గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారంటే దానికి ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహం ప్రధా న కారణం అన్నారు. మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగా న్ని బలోపేతం చేస్తున్నారని కొనియాడారు.
– మండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి
మహిళలను ప్రోత్సహిస్తున్నాం
జిల్లాలోని మహిళలను ప్రోత్సహిస్తున్నామని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. మహిళలు విద్యలో ముందుండాలని, దానితోనే సమాజంలో గౌర వం, జ్ఞానం లభిస్తాయన్నారు. ఉన్నత విద్యావంతులైన మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. కుటుంబంతో పాటు ఆర్థిక అంశాలపైన మహిళలు పట్టుసాధించాలని కోరారు. మహిళలకు అనేక అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
– జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి