పొగమంచు అందాలు సంగారెడ్డి జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. తెల్లవారు జామున కురిసే మంచు చూపరులను ఆకర్షిస్తున్నాయి. శీతాకాలం ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా గురువారం దట్టంగా కురువగా, రహదారులన్నీ మంచు తెరతో కమ్మేశాయి. పొద్దు పొద్దున్నే పక్షుల రాగాలు.. పువ్వులపై కురుస్తున్న బిందువులు ఆకట్టుకుం టున్నాయి. పొగమంచు దృశ్యాలు జిల్లా వాసులను ఆనందపరుస్తున్నాయి.
హిమాలయాలే తరలివచ్చాయా అన్నట్లుగా సంగారెడ్డి జిల్లా అంతటా గురువారం ఉదయం వాతావరణం హిమగిరులను తలపించింది. ఎటుచూసినా దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. మంచు బిందువులు.. శీతల గాలులు.. ఆహ్లాదకర వాతావరణం.. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. పొంగమంచు తీవ్రతకు వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. ఉదయం వివిధ దైనందిన పనుల్లో నిమగ్నమైన వారు, చిరువ్యాపారులు, రైతులు, పారిశుధ్య కార్మికులు చలికి గజగజ వణికారు. పొగమంచు చీల్చుకుంటూ వస్తున్న ఉదయ భానుడి దృశ్యాలు చూపరులను కనువిందు చేశాయి.