మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ, ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ హనుమంత్రెడ్డి, ఆర్డీవో సాయిరాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పం టను దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతేడాది జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాల ద్వారా 4లక్షలు 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సారి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. అవసరమైన చోట గత ఏడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా రైతులకు సం చు ల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లావ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ మార్కె ట్ కమిటీ కార్యదర్శి ఉషా గెహ్లట్, సహకార సంఘం సీఈవో సాయికిరణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు, సహకార సంఘ డైరెక్టర్లు గందె రాములు, పద్మారావు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.