హెచ్ఎఫ్ఐ చీఫ్ జగన్మోహన్రావు
లక్నో: దేశీయ హ్యాండ్బాల్ భవిష్యత్ త్వరలో మారబోతున్నదని జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం జాతీయ బాలికల సబ్ జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి హాజరైన జగన్మోహన్రావు ట్రోఫీలు బహుకరించారు. విజేతగా నిలిచిన హర్యానా జట్టుకు ట్రోఫీ అందించి అభినందించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయన్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీకి దీటుగా హ్యాండ్బాల్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ను అట్టహాసంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.