కరీంనగర్ : టీఆర్ఎస్లో చేరికలో జోష్ కొనసాగుతున్నది. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు సమక్షంలో వేములవాడలో శుక్రవారం వట్టెంల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, రూరల్ జడ్పీటీసీ ఏశ వాణి, మండల పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి ఉన్నారు.