న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు విభిన్న మోడల్ కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు సోమవారం తెలిపింది. దేశంలో అత్యధికంగా కార్లు విక్రయిస్తున్న మారుతి సుజుకి.. గత నెలలోనూ ఇన్పుట్ వ్యయాల పెరుగుదల పేరుతో కొన్ని కార్ల మోడల్ ధరలను పెంచివేసింది.
ఇన్పుట్ వ్యయాలు పెరిగినందునే..
‘వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోవడంతో ఏడాది కాలానికి పైగా వాహనాల తయారీ ఖర్చుపై తీవ్ర ప్రభావం చూపింది. తప్పనిసరి పరిస్థితుల్లో మా సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తున్నది. అందుకోసం ఏప్రిల్ నుంచి వివిధ మోడల్ కార్ల ధరలు పెరుగుతాయి’ అని రెగ్యులేటరీ ఫైలింగ్లో మారుతి సుజుకి తెలిపింది. సోమవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ముగిసిన తర్వాత మారుతి సుజుకి ఈ ప్రకటన చేసింది. అయితే, మారుతి షేర్ రూ.7,103 వద్ద ముగిసింది.
కరోనా వల్ల పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ప్రైవేట్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్లకు విపరతీమైన డిమాండ్ పెరిగింది.. కానీ అందుకు తగినట్లు సరఫరా చేయడానికి కార్లు అందుబాటులో లేకున్నా.. గత నెలలో ప్రధాన కార్ల తయారీ సంస్థలు డబుల్ డిజిట్ వ్రుద్ధిరేటు నమోదు చేశాయి.
గత నెలలో మారుతి సేల్స్ 11.8 % గ్రోత్
గత నెలలో మారుతి సుజుకి కార్ల విక్రయంలో 2020తో పోలిస్తే 11.8 శాతం పురోగతి నమోదైంది. ఈ ఏడాది 1,64,649 యూనిట్లు విక్రయించింది. ఇక ఎస్యూవీ మోడల్ కార్ల సేల్స్లో 2020తో పోలిస్తే 18.9 శాతం పెరిగింది. గతేడాది విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎర్టిగా, ఎక్స్ఎల్-6 మోడల్ కార్లు 22,604 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 26,884 యూనిట్లు విక్రయించారు. అయితే, ఎంట్రీ లెవెల్ కార్లు, ఫ్లాగ్ షిప్ సెడాన్ కార్ల విక్రయాలు మాత్రం గత నెలలో పడిపోయాయి. ఆల్టో 800, ఎస్-ప్రెసో మోడల్ కార్లు 23,959 యూనిట్లు, సియాజ్ 40.6 శాతం పడిపోయాయి.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !