Market Cap | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.2.50 లక్షల కోట్ల పైచిలుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2.55 శాతం అంటే 1490.83 పాయింట్లు లాభ పడింది. అయితే, టాప్-10 సంస్థల్లో ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో నష్టపోయాయి.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.46,380.16 కోట్లు పెరిగి రూ.16,47,762.23 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.43,648.81 కోట్లతో రూ.14,25,928.82 కోట్లకు పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,273.78 కోట్లు పెంచుకుని రూ.4,62,395.52 కోట్లకు చేరితే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.39,129.34 కోట్లతో రూ.8,59,293.61 కోట్లకు ఎగసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.36,887.38 కోట్లు గెయిన్ అయి మొత్తం రూ.5,50,860.60 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.27,532.42 కోట్లు పెరిగి రూ.4,38,466.16 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,333.93 కోట్లు పెంచుకుని రూ.5,67,778.73 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.1820.06 కోట్లు పెరిగి రూ.4,70,300.72 కోట్ల వద్ద ముగిసింది. ఇక ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.32,172.98 కోట్లు నష్టపోయి రూ.7,62,541.62 కోట్లకు పడిపోయింది. విప్రో ఎం-క్యాప్ రూ. 2,192.52 కోట్లు పతనమై రూ.3,89,828.86 వద్ద స్థిరపడింది. టాప్-10 సంస్థలకు రిలయన్స్ సారధ్యం వహిస్తున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, విప్రో నిలిచాయి.