న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో వైరస్ భయాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతూ అయినకాడికి దండుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల నుంచి రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆస్పత్రి పడకల వరకూ అన్నింటా బ్లాక్ మార్కెట్ కు తెరలేపుతున్నారు. ఇక గుజరాత్ లోని వదోదరలో డూప్లికేట్ శానిటైజర్ల రాకెట్ ను పోలీసులు ఛేదించారు.
రూ పది లక్షల విలువైన నకిలీ శానిటైజర్లను రెండు దుకాణాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ నడిపించే నితిన్ కొత్వాని నకిలీ శానిటైజర్లను విక్రయిస్తూ పది నెలల్లో రూ పది కోట్లు సొమ్ము చేసుకున్నాడు. నిందితుడు నితిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్యానికి హానికరమైన ఈ నకిలీ శానిటైజర్లను నిందితుడి నుంచి ఎవరెవరు కొనుగోలు చేశారనేది ఆరా తీస్తున్నామని వదోదర పోలీస్ కమిషనర్ షంషేర్ సింగ్ తెలిపారు.