థానే: మహారాష్ట్రలో కోడలిపై తన రివాల్వర్తో మామ కాల్పులు జరిపాడు. టీతో పాటు ఆల్పాహారం పెట్టలేదన్న కోపంతో మామ తన గన్తో ఫైర్ చేశాడు. ఆ కాల్పుల్లో 42 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. థానే నగరంలో ఈ ఘటన జరిగింది. ఐపీసీలోని 307, 506 సెక్షన్ల ప్రకారం కేసును బుక్ చేశారు. ఈ ఘటనలో 76 ఏళ్ల కాశీనాథ్ పాండురంగ పాటిల్పై కేసు బుక్ చేశారు. మరో కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాల్పుల ఘటన గురువారం 11.30 నిమిషాలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మార్నింగ్ టీతో పాటు టిఫిన్ పెట్టలేదన్న కోపంతో మామ తన వద్ద ఉన్న గన్తో ఫైర్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.