మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిపోయాడు. గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు అతడిని బయటకు తీశారు. అయితే అతడు అప్పటికే మృతిచెండాని అధికారులు వెల్లడించారు. మృతుడిని విశాఖపట్నంకు చెందిన గుడ్ల సోమేశ్గా గుర్తించారు. మృతుని సబంధీకులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.