Vijayawada | ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమానుష ఘటన జరిగింది. లేడీస్ బాత్రూంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, మహిళలు స్నానాలు చేసే దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. ఇది గమనించిన పలువురు మహిళలు కేకలు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మహిళల అరుపులతో అప్రమత్తమైన భక్తులు, మహిళా సెక్యూరిటీ సిబ్బంది నిందితుడి పట్టుకుని, చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని విజయవాడలోని చిట్టి నగర్కు చెందిన నరేశ్గా గుర్తించారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకుని సేల్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.