లక్నో : యూపీలోని బదౌన్లో ఎలుకుకు రాయిని కట్టి నీటిలో ముంచిన వ్యక్తిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ, నిందితుడు మనోజ్ కుమార్పై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది. ఎలుక తోకకు రాయి కట్టిన వ్యక్తి ఆపై దాన్ని కాలువలో ముంచాడు. జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదు నమోదు చేయడమే కాకుండా ఎలుకను కాపాడేందుకు రంగంలోకి దిగాడు. కాలువ నుంచి ఎలుకను బయటకు తీసుకువచ్చిన తర్వాత కొద్దిసేపటికి అది మరణించింది.
నిందితుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించామని, మరణించిన ఎలుకను ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం బదౌన్లోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించామని సదర్ కొత్వాలి పోలీస్స్టేషన్ ఎస్పీ అలోక్ మిశ్రా పేర్కొన్నారు. ఆపై అక్కడి సిబ్బంది పరీక్ష నిర్వహించేందుకు నిరాకరించడంతో ఎలుకను బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి తరలించారు.