చార్మినార్, నవంబర్ 12 : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. స్టీల్ బిజినెస్ నిర్వహించే టోలిచౌకి బాల్రెడ్డినగర్కు చెందిన మహ్మద్ అస్ఘర్ (36) తన స్నేహితులైన బాజీఘర్, గుజరాత్ రాష్ర్టానికి చెందిన ప్రత్యూష్లతోపాటు తన సన్నిహిలతో కలిసి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడ్డాడు. ఫైర్బుక్.ఐఓ వెబ్సైట్ ద్వారా ఫంటర్లను ఆహ్వానిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం మహ్మద్ అస్ఘర్ ఇంటిపై దాడులు నిర్వహించారు. అతడి వద్దనుంచి రూ.1లక్షా 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో ఫంటర్లు డిపాజిట్ చేసిన రూ.3లక్షల 92వేల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. బాజీఘర్, ప్రత్యూష్లు పరారీలో ఉండగా మహ్మద్ అస్ఘర్ను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం గోల్కొండ పోలీసులకు అప్పగించారు.