కోల్కతా, జనవరి 31: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, సీఎం మమత బెనర్జీల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. మమత సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మమతనే స్వయంగా వెల్లడించారు. ‘ఆయన (గవర్నర్ ధన్కర్) నన్ను, అధికారులను దుర్భాషలాడుతూ ప్రతిరోజూ ట్వీట్ చేస్తున్నారు. ప్రభుత్వం బాండెడ్ లేబర్గా మారింది. అందుకే ఆయన్ను బ్లాక్ చేశాను’ అని మీడియాతో అన్నారు.