సిద్దిపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వెళ్తారు. అలాంటి తిరుపతి నుంచి సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ను తిలకించేందుకు ఓ కుటుంబం వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రిజర్వాయర్ను జాతికి అంకితం చేసిన కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన ఆ కుటుంబం ఈ అద్భుత జల సాగరాన్ని వీక్షించాలని తరలివచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత జలాశయం, బహుళ దశల ఎత్తిపోతలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
మాది తిరుపతి పక్కన పాకన్నపేట. సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ను ప్రారంభించడాన్ని టీవీల్లో చూశాం. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఆ ప్రాజెక్టును తప్పకుండా చూడాలని నిర్ణయించుకొన్నాం. బుధవారం రాత్రి బయలుదేరి ఇక్కడి వచ్చాం. మల్లన్నసాగర్ బ్రహ్మాండంగా ఉంది. మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. సాగునీటి కోసం సీఎం చేసిన పనులు చాలా బాగున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ బండ్ నుంచి దిగబుద్ధి కావడం లేదు.
– తిరుపతి నుంచి వచ్చిన పర్యాటకులు