ముంబై: శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ..ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈనెల 26 నుంచి మొదలవుతున్న లీగ్లో రాజస్థాన్ జట్టుకు మలింగ సేవలందించనున్నాడు. మరోవైపు ప్యాడీ ఆప్టన్ను ‘టీమ్ క్యాటలిస్టు’గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.