Maldives | మాలే, జనవరి 29: మాల్దీవులు పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య గొడవ అనంతరం అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జుకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ, డెమొక్రాట్స్ సిద్ధమవుతున్నారు. అంతేగాక సోమవారం పార్లమెంట్లో మయిజ్జు సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు అనుకూలంగా వ్యవహరించే నలుగురు సభ్యులను మయిజ్జు సర్కార్ క్యాబినెట్లోకి తీసుకోగా, ఇందులో ముగ్గురు సభ్యుల్ని క్యాబినెట్లోకి తీసుకోవటాన్ని పార్లమెంట్ తిరస్కరించింది.