తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Salakatla Brahmotsavam) రెండో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపైశ్రీ కృష్ణుడి అలంకారంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారని టీటీడీ అధికారులు వివరించారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.