హైదరాబాద్, నవంబర్ 18: దేశంలో అతిపెద్ద ఆభరణాల విక్రయాల సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ ఫ్లాగ్షిప్ స్టోర్ను ఈ నెల 27న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఆర్టిస్ట్రీ స్టోర్లో ప్రత్యేక హస్తకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు లెక్కకు మిక్కిలి డిజైన్లలో లభించనున్నాయని మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. మరోవైపు, రూ.750 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో బంగారం, వజ్రాభరణాల తయారీ యూనిట్ను నెలకొల్పుతున్నది సంస్థ. తద్వారా 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.