మక్తల్రూరల్: మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడిన ఘటనలో 73 గొర్రె పిల్లలు మృతి చెందా యి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో రుద్ర సముద్రం గ్రామ శివారులో గొర్రెల మందపై పిడుగు పడింది. దీంతో మందలో ఉన్న దాదాపు మొత్తం 73 గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి.
వివరాలలోకి వెళితే… రుద్రసముద్రం గ్రామానికి చెందిన మల్లప్ప, సాయన్న, అంజలప్ప, జాంబయ్యలకు చెందిన గొర్రెలు గ్రామ శివారులో రాత్రి వేళ మందలో వదిలారు. అయితే అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీగా ఉరు ములు, మెరుపులతో కుండపోతగా వర్షం పడింది.
ఇదే సమయంలో ఉరుములకు, పిడుగుపాటుకు గురై గొర్రెలు మృతి చెందాయి. పిడుగుపాటుకు మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు 5లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకో వాలని గొర్రెల కాపరులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.