గాంధీనగర్: గుజరాత్లోని సూరత్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ సమీపంలో ఉన్న ఓ మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. పరిశ్రమలో మరో 125 మంది కార్మికులు చిక్కుకుపోయారని, వారిని రక్షించామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.