ముంబై: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్ 22వ తేదీన వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకావాలన్నారు. థానే జిల్లాలో ముంబై పోలీసులు నూపుర్ శర్మపై కేసు నమోదు చేశారు. మరో వైపు ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో నూపుర్కు అదనపు భద్రత కల్పించేందుకు ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. ముందస్తు జాగ్రత్తగా ఆమె సెక్యూర్టీని పెంచినట్లు వెల్లడించారు.