ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ
50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులు
నమోదు కాగా 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి 864 మంది మరణించారు. ముంబైలోనే 2678 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇవాళ ఒక్కరోజే 62 మంది చనిపోయారు.
మొత్తం కేసులు:50,53,336
కోలుకున్న వారి సంఖ్య:43,47,592
మరణాల సంఖ్య: 75,277