ముంబై: కరోనా కల్లోలం వల్ల అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్ర వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నది. ఆ రాష్ట్రమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ సంగతి వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడువారాల్లో టీకాల పంపిణీ పూర్తి చేయాలని రోడ్మ్యాప్ తయారు చేశామని, డబ్బు పెద్ద సమయ్ కాదని అన్నారు. వీలైనంత త్వరలో టీకాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆదిత్య ఠాక్రే చెప్పారు. ఇతర రాష్ట్రాల్లాగే తామూ టీకాల కోసం ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్ నుంచి టీకాలు కొనుగోలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నామని వివరించారు. టీకా పట్ల ప్రజల్లో ఇదివరకున్న బెరుకు పోయిందని, టీకాలు తీసుకుని సాధారణ జీవితం గడపాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇది చాలా ముఖ్యమని మంత్రి అన్నారు. దేశంలోని యావత్తు మంది భారతీయులు టీకా తీసుకోనంత వరకు ఏ ఒక్క భారతీయుడు సురక్షితంగా లేనట్టేనని పేర్కొన్నారు.