Mahmood Ali | బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. యువ సంగ్రామ సభకు వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. సభను అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. యువ సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ మెడలు వంచుతామని మహమూద్ అలీ తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నిరుద్యోగులను అడ్డుకుని కాంగ్రెస్ నిర్బంధ పాలన కొనసాగిస్తుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నదని అన్నారు. సభను అడ్డుకుంటే నిరుద్యోగుల ఆక్రోశం అగ్నిపర్వతంలా ఎగిసిపడుతుందని స్పష్టం చేశారు.