ఊట్కూర్, ఫిబ్రవరి 15 : కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆయన నిఘంటువులను పంపిణీ చేశారు. తాను చదువుకునే రోజుల్లో నేలపై కూర్చు ని చదువుకున్నానని గుర్తు చేశారు. అప్పట్లో చదువు కోసం కిలోమీటర్ల దూరం నడిచేవారన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం నేడు విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులను కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆ ర్ ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. చదువు తల్లిదండ్రులు ఇచ్చేది కాదని, తరగని ఆస్తి చదువు ఒక్కటేనన్నారు. విద్యార్థులు ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని రాణించాలన్నారు. పదో తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదికి పది పాయింట్లు సాధించాలని ఆశించారు. వి ద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు నిఘంటువుల పంపిణీకి కృషి చేసిన దాతలు, ఉపాధ్యాయులను అభినందించారు. అంతకుముందు విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమానికి ఎంఈవో వెంకటయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, ఎంపీటీసీ హన్మంతు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధానోపాధ్యాయులు స్పందన, లక్ష్మారెడ్డి, శ్రీ విద్య, శ్రీనివాసులు, సురేశ్, నాగం శేఖర్రెడ్డి, నర్సింగప్ప, అరుణ పాల్గొన్నారు.
వీఆర్ఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కో రుతూ మంగళవారం మండల వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో మక్తల్ ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు రా జప్ప, జేఏసీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, అధ్యక్షుడు వెంకటయ్య, సంఘం నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని చిన్నపొర్ల, తిప్రాస్పల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు మక్తల్ ఎమ్మెల్యే మంగళవారం భూమి పూ జలు చేశారు. చిన్నపొర్లలో పులిమామిడి రోడ్డు నుంచి దొ బ్బలి హన్మంతు ఇంటి వరకు పనులను ప్రారంభించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ జగత్చంద్ర, సర్పంచ్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీ రవిప్రసాద్రెడ్డి, రైతు బంధు సమి తి గ్రామ అధ్యక్షుడు అనిల్రెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షు డు అర్షద్ పాల్గొన్నారు.
మక్తల్ రూరల్, ఫిబ్రవరి 15 : పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పని చేస్తుంద ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. పట్టణంలో ఎమ్మెల్యే స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.1. 8లక్షల చెక్కులను వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, కర్ని మాజీ సర్పంచ్ రాఘవేందర్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని గుడిగండ్లలో మంగళవారం శివ మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మక్తల్ ఎ మ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని శివాలయంలో శివ స్వాములు భక్తి శ్రద్ధలతో శివ దీక్షలు చేపట్టా రు. స్వాములు ఆలయంలో శివుడికి పంచామృతాభిషేకం, మహా మంగళహారతి ఇచ్చారు. అంతకుముందు తెల్లవారుజామున మహా రుద్రాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీస్సులు అందజేశారు. ఆలయ క మిటీ సభ్యులు, శివ స్వాములు మక్తల్ ఎమ్మెల్యేకు పట్టు వ స్ర్తాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు, శివ స్వాములు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, పిబ్రవరి 15 : నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికే జీవితం అంకితమని మక్తల్ ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఉమ్మడి జిల్లా అగ్నిమాపక డివిజనల్ అధికారి సుధాకర్తో మంగళవారం ఎమ్మె ల్యే సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అ గ్నిమాపక కేంద్రానికి రూ.3కోట్లు నిధులు విడుదల చేయించామని, త్వరగా పనులు చేపట్టాలని పేర్కొపారు. ఫైర్ స్టే షన్ కోసం స్థలం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఫైర్ స్టేషన్ మక్తల్ ప్రజల చిరకాల కోరక అని తెలిపారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో జి ల్లా ఫైర్ అధికారి వెంకటయ్య, టీఆర్ఎస్ నర్వ మండల అ ధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
మాగనూర్, ఫిబ్రవరి 15 : మండలకేంద్రానికి చెందిన చాకలి నర్సింహులుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరై న రూ.52వేల చెక్కును మంగళవారం మక్తల్ ఎమ్మెల్యే స్వగృహంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ల క్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.