జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం మున్సిపాలిటీలోని హరిజనవాడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూం ఇం డ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్స న్ దోరేపల్లి లక్ష్మి, వైస్చైర్పర్సన్ సారిక, కౌన్సిల ర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కారణజన్ముడు సీఎం కేసీఆర్
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 15 : ముఖ్యమం త్రి కేసీఆర్ కారణజన్ముడని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు కొండా శ్రీనివాస్రెడ్డి, బాలరాజు, భాస్కర్రెడ్డి, రాధాకృష్ణ, చల్మారెడ్డి, యుగంధర్రెడ్డి, భాస్కర్, కృష్ణ పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఫిబ్రవరి 15 : మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బ స్వరాజ్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక కేజీబీవీ విద్యార్థినులకు పం డ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్గౌడ్, చంద్రమౌళి, డైరెక్టర్ గడ్డం రాములు, సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, సురేశ్గౌడ్, రాకేశ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఫిబ్రవరి 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజాపూర్ పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే జడ్చర్లలోని సత్యేశ్వర అనాథాశ్రమంలో మూడురోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీటీసీ అభిమన్యురెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు నరహరి, యా దగిరి, విజయ్, శ్రీనివాస్, మహిపాల్రెడ్డి, తిరుపతయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బాలానగర్ మండలం చెన్నంగులగడ్డతండా పంచాయతీలోని కేజీబీవీ విద్యార్థినులకు వైస్ఎంపీపీ వెంకటాచారి నోట్పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, సర్పంచులు రవినాయక్, రమేశ్నాయక్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, సింగిల్విండో డైరెక్టర్ మంజూనాయక్ , నాగిరెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఫిబ్రవరి 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మిడ్జిల్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, బాలు, దానియేలు, వెంకటయ్య పాల్గొన్నారు.
ఎదిర ప్రాథమిక పాఠశాలలో..
మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 4వ వార్డులోని ఎదిర ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యాదమ్మ, నాయకులు సూ ద నర్సింహులు, హన్మంతు, వెంకటయ్యగౌడ్, ఎల్లయ్య, శేఖర్, శ్రీనివాసులు, కృష్ణయ్య, ముర ళీ, వీరస్వామి, శ్రీనివాస్రెడ్డి, ధనుంజయ, అమర్నాథ్రెడ్డి, తిరుపతయ్య, శ్రీకాంత్, భాను, నర్సింహులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య, వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్, కోఆప్షన్ సభ్యుడు మన్నాన్, సర్పంచ్ వెంకన్న, ఉపసర్పంచ్ గంగాపూరి, కొండా బాలయ్య, జంబులయ్య, రమణారెడి, అనంతరెడ్డి, మహేందర్, రాఘవేందర్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మహ్మదాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటయ్య, తిరుమల్రెడ్డి పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం స్థానిక దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, ఎంపీటీసీ ఆంజనేయులు, రాజేంద్రప్రసాద్గౌడ్, గిరిధారి నాగన్న, భీంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజవర్ధన్రెడ్డి, నారాయణగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, నజీమ్, ఆశన్నగౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.