గద్వాల, డిసెంబర్ 21 : ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమా న్ని బుధవారం కామారెడ్డి నుంచి వర్చువల్ పద్ధతిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, స్పీ కర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. కాగా, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్హాల్లో మంత్రి నిరంజన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణుల్లో వచ్చే రక్తహీనతను అరికట్టి, పోషకాహార స్థాయిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తుందన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు, మూడో చెకప్లు చేసుకున్న తర్వాత గర్భిణులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ పథకం భారతావనికి ఆదర్శమన్నారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన, రుగ్మతలు లేని సమాజాన్ని అందించడానికి ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షే మం ప్రభుత్వానికి రెండు కండ్లలాంటివన్నారు. శుద్ధ, సురక్షిత నీరు తాగితే ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు.
ప్రజ లు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందిస్తున్నారని తెలిపారు. విటమిన్లతో కూడిన ఆహారం తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా లో ఒకేసారి ఈ పథకానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారన్నారు. భారతదేశ మహిళది ప్రపంచంలోనే గొప్ప సం స్కృతి అని.. తల్లి, చెల్లి, భార్య, సోదరి, కోడలిగా బాధ్యత లు నిర్వరిస్తూ ఎప్పుడూ తన కుటుంబం గురించే ఆలోచిస్తుందన్నారు. ప్రతి పీహెచ్సీలో గర్భిణులకు ఈ కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించి హిమోగ్లోబిన్ శాతం పెంచడమే ఈ కిట్ లక్ష్యమన్నారు. మాతా శిశుసంరక్షణలో భాగంగా ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతం సాధించిందని.., ఇప్పుడు నూతన పథకం కూడా సూపర్ హిట్ అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనంతరం మల్దకల్ మం డలం పెద్దపల్లికి చెందిన గర్భిణి లక్ష్మి, గద్వాల పట్టణానికి చెందిన జననితో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గురించి మంత్రి మాట్లాడించారు. గర్భిణులకు సేవలందిస్తున్న ఆశ, ఏఎన్ఎంలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర నోడల్ అధికారి సూర్యశ్రీరావు, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, ఇన్చార్జి డీఎంహెచ్వో సిద్ధప్ప, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ జంబురామన్గౌడ్, ఆర్డీవో రాములు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.