మాగనూర్, డిసెంబర్ 21: ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మాగనూర్ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. ఉదయం పోలీస్ సిబ్బంది పరేడ్ను పరీశీలించారు. అనంతరం పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు. ఇన్వేస్టిగేషన్లో ఉన్న సీడీ ఫైల్స్ను పెండింగ్ ట్రయల్లో ఉన్న సీడీ ఫైళ్లను గ్రేవ్ కేసెస్లో ఉన్న సీడీ ఫైళ్లను పరిశీలించారు. పోలీస్ అధికారులు సిబ్బంది తో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. సిబ్బందిని పరిచయం చేసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
విధినిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీపడి విధులు నిర్వహించాలని, అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి అవార్డులు రివార్డులు ప్రతినెలా ఇవ్వ డం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. వీపీవో పోలీస్ ఆఫీసర్ సంబంధిత గ్రామాలను సందర్శంచి ప్రజల సమస్యలపై ఆరా తీయాలన్నారు. సైబర్ నేరాల గురించి గ్రామల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్రైమ్ క్రిమినల్ ట్రా కింగ్ నెట్ వర్క్ సిస్టం ద్వారా దరఖాస్తులను ఎఫ్ఐఆర్లను సీడీఎఫ్ పార్ట్-1 పార్ట్-2 రిమాండ్ సీడీ, చార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఐన్లెన్లో ప్రతిరోజు ఎంటర్ చేయాలని అదేశించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసుల్లో శిక్షల శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బందితో ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్లో ఇన్వేస్టిగేషన్ ఎస్ఓపీ ప్రకారం క్రమ పద్ధ్దతిలో ఉన్నందున ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమలో మక్త్తల్ సీఐ సీతయ్య ఎస్సై పర్వతాలు, కృష్ణ ఎస్సై విజయ్భాస్కర్. మాగనూర్ ఏఎస్సై అంజన్రావ్, మన్నాన్ పాల్గొన్నారు.