ఊట్కూర్, డిసెంబర్ 20 : రైతు లు వరికి బదులుగా అధిక ఆదా యం వచ్చే ఆయిల్ పాం సాగును చేపట్టాలని పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌ రవాధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి అ న్నారు. స్థానిక రైతువేదిక భవనంలో ఆయిల్ పాం తోటల పెంపకంపై ఉ ద్యాన శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం ఏర్పాటు చేసిన అవగాహన శిబిరానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వరి సాగుతో రైతుపై భారం పడుతుందని, దీర్ఘకా లం ఆదాయం వచ్చే ఆయిల్ పాంను సాగు చే యాలని సూచించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆ యిల్ పాం సాగు చేపట్టేందుకు ఎకరాకు 57 మొ క్కలు అవసరమవుతాయని, రైతులు ఒక మొక్క కు రూ.20 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ, ఇతరులకు 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం డ్రిప్ పరికరాలను సరఫరా చేస్త్తుందన్నారు. పంట సాగైన నాలుగేండ్లుకు దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ పాం సాగు చే సిన రైతులకు నాలుగేండ్ల పాటు ఏడాదికి ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రభుత్వ రాయితీ అం దుతుందన్నారు. పంట దిగుబడి ఎకరాకు 10 నుంచి 14 టన్నులు పండుతుందని చెప్పారు రైతు లు పండించిన ఆయిల్ పాం పంటను టీఎస్ ఆ యిల్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. కా ర్యక్రమంలో హార్టికల్చర్ అధికారి సంతోష్కుమా ర్, ఏవో గణేశ్రెడ్డి, ఊట్కూర్, దంతన్పల్లి రైతు బంధు సమితి అధ్యక్షులు శివరామరాజు, చంద్రశేఖర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.