కొల్లాపూర్, జనవరి 18: మండలంలోని సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూ లతో అలంకరించిన రథం ఎదుట ఆలయ ఫౌండర్, చైర్మన్ రాజా ఎస్వీకేకేబీ ఆదిత్యలక్ష్మారావు, తనయుడు విరుద్ రాంగోపాల్రావు, ఆలయ ప్రధాన అర్చకుడు ఓరుగంటి సంపత్కుమార్శర్మ ఆధ్వర్యంలో హో మం నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాయలసీమ భక్తులు ప్రత్యేక వాహనాల్లో సోమవారం రాత్రే క్షేత్రానికి చేరుకున్నారు.
జాతరలో భారీ పోలీస్ బందోబ స్తు ఏర్పాటు చేశారు. సీఐ వెంకట్రెడ్డి విధుల్లో ఉన్న పోలీసుల తో ఎప్పటికప్పుడు మాట్లాడు తూ సమన్వయం చేస్తున్నారు. డీఎస్పీ మోహన్రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పా టు చేశారు. అయితే జా తర మైదానంలోకి బై క్లను సైతం అనుతించకుండా ఎన్మన్బెట్ల క్రాస్రోడ్డు నుంచి లక్ష్మీదేవమ్మగుట్ట వర కు రోడ్డుమార్గంలో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్పోస్టు వద్ద ఎ స్సై, హెడ్కానిస్టేబుల్, నలుగురు కా నిస్టేబుళ్ల చొప్పున విధుల్లో ఉన్నారు. కొల్లాపూర్-వనపర్తి, కొల్లాపూర్-వయా కోడేరు, నాగర్కర్నూల్కు వెళ్లే ఆర్టీసీ బస్సులు జాతర మైదానం గుండా వెళ్లకుండా వయా ఎన్మన్బెట్ల, జావాయిపల్లి, సింగవట్నం మీదుగా దారి మ ళ్లించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. అదేవిధంగా రత్నలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రామశర్మ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగి పరందామరెడ్డి పర్యవేక్షించారు.
స్నానాల గుండం వద్ద భక్తుల రద్దీ
కరోనా విస్తరిస్తున్న వేళ.. ఆలయం పక్కనే ఉన్న స్నానాలగుండం వద్ద, తలనీలాలు సమర్పించేందుకు భక్తులు రద్దీ గా కనిపించారు. పుణ్యక్షేత్రంలో కరోనా ప్రబలకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతరలో తినుబండారాలు, చెరుకుగడలు, పిల్లల ఆటవస్తువుల దుకాణాలు వెలిశాయి.
అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ పక్కనే రెవె న్యూ శిబిరాన్ని ఆర్ఐ అలీబాబానాయుడు నేతృత్వంలో వీ ఆర్వోలు విధులు నిర్వహించారు.