దేవరకద్ర రూరల్, అక్టోబర్ 3 : గ్రామా ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయిస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. దేవరకద్ర మండలం హజిలాపూర్లో సోమవారం హైమాస్ట్లైట్లను ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్ర భుత్వం కృషి చేస్తున్నదన్నారు. అన్ని గ్రామాలకు బీటీరోడ్డుతోపాటు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు, వైకుంఠధామాలను నిర్మించినట్లు తెలిపారు. అలాగే ఇంటింటి నుంచి చెత్త సేకరణకోసం ప్రతి పంచాయతీకీ ట్రాక్టర్ను అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెరిగిందన్నారు. గ్రామా ల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాము లు కావాలని కోరారు.
అనంతరం పెద్దగోప్లాపూర్లో మాజీ ఎంపీటీసీ మోహన్రెడ్డిని పరామర్శించారు. మోకాలికి శస్త్రచికిత్స చే యించుకున్న అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో స్కూటీ అందుకున్న దివ్యాంగుడు నాగన్న.. ఎమ్మెల్యే ఆలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, సర్పంచులు బుచ్చారెడ్డి, మాధవీశ్రీనివాసు లు, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు, శ్రీకాంత్యాదవ్, భాస్కర్రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్,
భూత్పూర్, అక్టోబర్ 3 : ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందిన భూత్పూర్ ము న్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కమిషనర్ నూరుల్నజీబ్ను అన్నాసాగర్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల ర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, ముడా డైరెక్టర్ సాయిలు, అజీజ్, అశోక్గౌ డ్, గడ్డం రాములు, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్కుమార్, బాలస్వామి పాల్గొన్నారు.