రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. అన్నాతమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. మహిళా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి తన సోదరి సద్గుణ రాఖీ కట్టారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి తన సోదరీమణులతోపాటు పలువురు రాఖీ కట్టి ఆశీర్వదించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు మహిళా ఉద్యోగులు, సిబ్బంది రాఖీ కట్టి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
– నెట్వర్క్ నమస్తే తెలంగాణ, ఆగస్టు 12