మహబూబ్నగర్, అక్టోబర్ 29 : జిల్లావ్యాప్తంగా ధరణి సేవలను విజయవంతం గా అమలు చేస్తున్నామని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. ధరణి సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా 2020 అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి సేవలను ప్రారంభించారని తెలిపారు. దీంతో ఎక్కడా లేనివిధం గా భూపరిపాలన రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. ధరణి సేవలు జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. ధరణి ద్వారా జిల్లా లో 46,122 స్లాట్స్ బుక్ అయ్యాయని, 22,546 సేల్స్ ట్రాన్స్క్షన్, 5,946 గిఫ్ట్ ట్రాన్స్క్షన్, 894 సక్సేషన్లను పూర్తి చేసినట్లు వివరించారు. అలాగే 7,560 మ్యుటేషన్లు, 7,129 భూముల విషయాలపై వచ్చి న ఫిర్యాదులు, 1,711 ప్రొహిబిటేడ్ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలతోపాటు 1,762 కోర్టు కేసులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రస్తుతం 21 మాడుల్స్ ఉన్నాయని, సామాన్య ప్రజలకు ధరణి యాప్ ఉపయోగించేవిధంగా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో 22,546 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు. ధరణి ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. నవంబర్ 8నుంచి తాసిల్దార్ కార్యాలయాల్లో ధరణి కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ధరణిలో ఇప్పటివరకు 4 తప్పుడు లావాదేవీలు జరుగగా, కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ధరణిలో ఆధార్ లింక్తో అనుసంధానం ఉండడంవల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. పట్టాదారు పాసుపుస్తకంలో 14 సెక్యూరిటీ ఫిచర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేరు మార్పు, విస్తీర్ణం, వర్గీకరణకు సంబంధించి త్వరలోనే యాప్ రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకుముందు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ధరణి విజయవంతం కావడంపై కళాకారులు ప్ర త్యేక గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ సర్వీసెస్ అధ్య క్ష, కార్యదర్శులు చె న్నకిష్టన్న, రాజగోపాల్, రాజీవ్రెడ్డి, ఆర్డీవో పద్మశ్రీ, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సేవలు సులభతరం
మహ్మదాబాద్, అక్టోబర్ 29 : ధరణి పో ర్టల్తో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభతరమయ్యాయని తాసిల్దార్ ఆంజనేయులు అన్నారు. ధరణి సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో రైతులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిక్షపతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 29 : ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ శంకర్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మహేశ్, ఆర్ఐలు ఖదీర్, సుజాత, జ్యోత్స్న, భాస్కర్, లక్ష్మీకాంత్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 29 : ధరణి సేవ లు ప్రారంభమై ఏడాది పూర్తయిన సం దర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో సం బురాలు నిర్వహించారు. ఈ సందర్భం గా తాసిల్దార్ శ్రీనివాస్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ హనీఫ్ఖాన్, ఆర్ఐ వెంకట్రాములు, రెవె న్యూ సిబ్బంది గోపి, ప్రశాంత్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, అక్టోబర్ 29 : ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం లో రెవెన్యూ అధికారులు కేక్ కట్ చేసి సం బురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడు తూ మండలంలో ఇప్పుటివరకు 2,400 రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సతీశ్కుమార్, ఆర్ఐలు కవిత, ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 29 : మండల రెవెన్యూ కార్యాలయంలో ధరణి పోర్టల్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాసులు కేక్ కట్చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.