మహబూబ్నగర్టౌన్,అక్టోబర్ 28 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీటీగుట్టలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేయించుకోని వా రిని గుర్తించాలని సూచించారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు 18ఏండ్లు నిం డిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అనంతరం 33వ వార్డులో పార్కు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ క మిషనర్ ప్రదీప్కుమార్, డాక్టర్ రఫీక్, ము న్సిపల్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేసుకోవాలి
నవాబ్పేట, అక్టోబర్ 28 : మండలం లో 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సి న్ వేసుకునేలా వైద్యసిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి సృజన సూచించారు. గురువారం మండలకేంద్రంతోపాటు తీగల్పల్లి సబ్సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ముందుగా నవాబ్పేట ప్రభుత్వ దవాఖానలో వసతులను పరిశీలించారు. అనంతరం వడ్డెరగేరి లో టీకాపై ఆరా తీశారు. టీకా వేయించుకో ని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, ఫార్మసిస్ట్ రాఘవేందర్, సిబ్బంది అవినాశ్, వినోదిని, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, అక్టోబర్ 28 : మండలంలోని కొనగట్టుపల్లిలో వైద్యసిబ్బంది వ్యవసాయ పొలాలకు వెళ్లి కూలీలకు కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. అలాగే దచ్చక్పల్లి, టంకర, పెద్దదర్పల్లి, నాయినోనిపల్లి, మాదారం గ్రామా ల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో ధనుంజయగౌడ్ పరిశీలించారు. కాగా, మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యా క్సినేషన్ను వందశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. కార్యక్రమంలో సర్పంచులు మానస, బాలకిష్టారెడ్డి, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, ఏఎన్ఎం మంజులాదేవి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 28 : మండలకేంద్రం లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. కరోనాను కట్టడి చేసేందు కు 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సి న్ వేయించుకోవాలని సూచించారు. అలా గే మాస్కులు ధరించి శానిటైజర్ వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది దేవయ్య, జంగయ్య, గీత, అంగన్వాడీ టీచర్ నర్మద పాల్గొన్నారు.
ఆలూర్లో వందశాతం వ్యాక్సినేషన్
జడ్చర్లటౌన్, అక్టోబర్ 28 : మండలంలోని ఆలూర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయింది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేశా రు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసిన వైద్యసిబ్బంది, సర్పంచ్ సుకన్యను టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేశ్, శ్రీదేవి, ఆశ కార్యకర్తలు నర్సమ్మ, నీలవేణి, అంగన్వాడీ టీచర్లు సరళ, యాదమ్మ, తిరుపతమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.