పెబ్బేరు, అక్టోబర్ 28 : నాడు సమస్యలతో సతమతమైన పెబ్బేరు పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. పెబ్బేరు, చెలిమిల్ల గ్రా మాలను కలిపి ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏ ర్పాటు చేసింది. 2019లో మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రూపురేఖలు మారిపోయాయి. పట్టణం సరికొత్త అందాలు సంతరించుకుంటున్నది. మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో నూతన పాలకవర్గం మౌలిక సదుపాయా లు కల్పిస్తున్నది. జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. విశాలమైన రహదారులతోపాటు డివైడ ర్లు నిర్మించారు. ప్రధాన కూడళ్లు, ముఖ్య రహదారుల వద్ద సుందరంగా తీర్చిదిద్దిన జంక్షన్లతో సరికొత్త అందాలు సంతరించుకున్నది. సెంట్రల్ లైటింగ్ విధానం దాదాపుగా పూర్తి కావడం తో పట్టణమంతా జిగేల్మంటున్నది. రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యా యి. వీటి నిర్మాణానికిగానూ జనరల్ ఫండ్ నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. దాదాపు 76 సెంట్రల్ లైటింగ్ పోల్స్ నిర్మించి.. కొన్ని చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా పట్టణ ప్రగతిలో భాగంగా రూ.40 లక్షలతో అంబేద్కర్ పార్క్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రూ.15 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్, రూ.10 లక్షలతో 1, 3వ వార్డుల్లో ట్రీ పార్కు, ప్రియదర్శిని జూరాల క్యాంప్ లో రూ.10 లక్షలతో ట్రీ పార్కు, కొత్తకోట, రంగాపూర్ బైపాస్ 44వ జాతీయ రహదారి సమీపంలో రూ.10 లక్షల నిధులతో పార్కుల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటిని మంత్రి నిరంజన్రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు.
మరిన్ని పనులకు ప్రతిపాదనలు..
పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నా యి. ఇప్పుడు జరుగుతున్న పనులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకుగానూ నిధుల కోసం ప్రతిపాదనలు పంపించారు. రూ. 4 కోట్లతో రెండెకరాల్లో అత్యాధునిక సమీకృత మార్కెట్ నిర్మా ణం, ప్రియదర్శిని జూరాల క్యాంపులో దాదాపుగా 9 ఎకరాల్లో మినీ స్టేడియం, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్పూల్ నిర్మాణాలకు రూ. 20 కోట్లు, రోడ్డు వెడల్పు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ. కోటి, ఎకరా స్థలంలో వైకుంఠధామం నిర్మాణానికి రూ.కోటి ని ధుల కోసం ప్రతిపాదనలు పంపించారు.
శరవేగంగా అభివృద్ధి..
పెబ్బేరు మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, పాలకవర్గం, కార్యాలయ సిబ్బంది, ప్రజల సహకారంతో ఊహించని విధంగా పనులు చేపడుతున్నాం. అత్యాధునిక వసతులతో కూడిన సౌకర్యవంతమైన పెబ్బేరు పట్టణ నిర్మాణం జరగాలన్నదే లక్ష్యం. అందుకు నా వంతు కృషి చేస్తున్నాను. మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం.
చివరి దశలో పనులు..
మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. మంత్రి నిరంజన్రెడ్డి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నాం. సౌకర్యవంతమైన పట్టణంగా ఖ్యాతి గడిస్తుంది. పచ్చదనం, పరిశుభ్రతకు పెట్టింది పేరుగా నిలవనున్నది. నిధులు మంజూరు చేసి పట్టణాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.