దొర్రితండా ప్రాథమిక పాఠశాల వాసి పెరిగింది. నాలుగేండ్ల కిందట ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉండడంతో మూత బడింది. తర్వాత తండా నుంచి పలువురు ప్రైవేటు పాఠశాలలకు
వెళ్లేవారు. దీంతో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను తెలియజేశారు. మౌలిక వసతులు, సరిపడా గదులు, నిష్ణాతులైనటీచర్లతో మెరుగైన విద్యాబోధనతోపాటు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులు ఉచితంగా అందిస్తామని అవగాహన కల్పించారు. దీంతో మూడేండ్ల కిందట తండాలోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు
నై అంటూ.. సర్కారు బడికి జై కొట్టారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో 70 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. దాతల సహకారంతో బ్యాగులు, నోట్పుస్తకాలు, పలకలు పంపిణీ చేస్తూ ప్రోత్సాహం అంది స్తున్నారు. దీంతో బడి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
హన్వాడ, నవంబర్ 17 : బడుల బలోపేతం దిశగా సర్కార్ కృషి చేస్తున్నది. విద్యా,వైద్యానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో తల్లిదండ్రులు సర్కార్ బడులపై మొగ్గుచూపుతున్నారు. హన్వాడ మండలంలోని దొర్రితండా ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉన్నది. గతంలో ఇక్కడ 5 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంతో పాఠశాల మూతబడింది. దీంతో తండా నుంచి 44 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లేవారు. పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వం కల్పిస్తున్న వసతులపై వివరించారు. నాణ్యమైన విద్యతోపాటు, మధ్యాహ్న భోజనం, దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఉచితంగానే అందిస్తామంటూ తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సరిప డా గదులు ఉన్నాయంటూ వివరించారు. తల్లిదండ్రులకు పూర్తిగా అవగాహన కల్పించడంతో గ్రామస్తులు కలసికట్టుగా తండా నుంచి ఒక్కరు కూడా ప్రైవేట్కు పంపకూడదని నిర్ణయించారు. దీంతో ఎవరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లడంలేదు. పాఠశాలలో ఇంగ్లిష్తోపాటు తెలుగు బోధిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 70 మంది చదు వుతున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు బ్యాగులు, పలకలు, నోట్పుస్తకాలు అందిస్తున్నారు.
43 మంది గురుకులాలకు ఎంపిక..
ఉపాధ్యాయుల కృషితో మూతబడిన పాఠశాలను జిల్లాలోనే పాఠశాల ఆదర్శంగా తీర్చిదిద్దారు. పదుల సంఖ్యలో విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యారు. 2017 సంవత్సరంలో 6, 2018లో 4, 2019లో 13, 2020లో 20 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యా రు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావుతో పాటు జిల్లా, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులను అభినందించారు.
తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం..
ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్లో చదువుకుంటే తేడా ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. దీంతో గ్రామస్తులంతా ముందుకు వచ్చి ప్రైవేట్కు ఒక్కరిని కూడా పంపొద్దని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉన్నది. విద్యార్థులకు మెరుగైన వసతులతోపాటు, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. నిత్యం సమయపాలన పాటిస్తూ పాఠశాలకు వెళ్తాం. గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు.
అందరి సహకారంతోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకూ పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో పాఠశాల ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. గ్రామస్తుల సహకారంతో ఒక్కరిని కూడా ప్రైవేట్కు పంపకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై అవగాహన కల్పించాం. దీంతో ప్రతి పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించారు. ఉపాధ్యాయుల కృషికి, తల్లిదండ్రుల నిర్ణయానికి ప్రత్యేకంగా అభినందనలు.