మహబూబ్నగర్టౌన్, నవంబర్ 17 : మాతాశిశు మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపై ఉందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులకు వైద్యం అందించడంపై ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు అన్ని పరీక్షలు చేయడంతోపాటు, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలపై అవగాహ న కల్పించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు గమనించాలని తెలిపారు. వైద్యాధికారి నుంచి మొదలుకొని ఏఎన్ఎం, సిబ్బంది వరకు అందరూ అప్రమత్తంగా ఉంటేనే మాతాశిశు మరణాలను అరికట్టవచ్చని కలెక్టర్ తెలిపారు. మాతాశిశు ఆరోగ్యంపై వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే కొవిడ్తో ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.50వేల ఆర్థికసాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో కృష్ణ, డిప్యూ టీ డీఎంహెచ్వో శశికాంత్, డాక్టర్లు రామ్మోహన్, రజ నీ, రమాదేవి, రఫియొద్దీన్ తదితరులు ఉన్నారు.