బాలానగర్, నవంబర్ 16 : కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్పస్వామి మాల ధరించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. కొందరు భక్తులైతే వారం, పది రోజులముందే మాలధారణ చేశారు. సహజంగా కార్తీక మాసంలో ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. 41 రోజులపాటు ఎంతో నిష్టతో గడుపుతా రు. నిత్యం స్వామి శరణుఘేషతో తరిస్తారు. భక్తులు కార్తీకమా సం నుంచి దాదాపు మార్గశిర, పుష్య, మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తుంటారు. స్వామితో నిశ్చలమైన భక్తి భావనలు కలిగి ఉంటారు. మాలధారణ అనంతరం మనస్సు, శరీరాన్ని భగవంతుడికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుడి రూపాలుగా భావించి అయ్యప్ప శరణుఘేషను వీడకుండా నిత్యం స్వామి భజన, ఆధ్యాత్మిక చింతనలో గడుపాలి. దీక్ష తీ సుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్లడానికి కఠిమైన నియమాలను అనుసరిస్తూ ప్రతి దినం పూజలు చేయాలి, ఈ క్రమంలో దసరా, దీపావళి పండుగలప్పటి నుంచే మాల ధరించే వారు అందుకు కావాల్సిన ఏర్పాట్లను సన్నద్ధ్దం చేసుకుంటారు. కులమతాలకు చోటు లేకుండా అయ్యప్ప స్వాములంతా సమానమేనని చాటి చెప్పేది అయ్యప్ప దీక్ష. దీక్ష చేసే ప్రతిఒక్కరి తో అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడని భావించి ప్రతిఒక్కరూ తలవంచి నమస్కరించే గొప్ప లక్షణం ఒక్క అయ్యప్ప స్వామి దీక్షకే దక్కుతున్నది. మండల కాలంలో దీక్ష చేస్తే స్వాములు రో జుల్లో ఒక్కసారి బిక్ష(భోజనం) అల్పహారం, ఉదయం సూర్యోదయం కన్నా ముందు పూజలు చేయాలి. దీక్ష చేసే స్వాములకు అటు అరోగ్యం, ఇటు శరీరంలో ఎంతో మేలు చేకూరుతున్నది. ఉమ్మ డి జిల్లాలో ఏటేటా దీక్షలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది.
రెండు డోసులు తప్పనిసరి..
అయ్యప్ప స్వామి దీక్షను తీసుకునే భక్తులు దీక్ష కాలం పూర్తి చేసి ఇరుముడితో స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే వారు అప్పటిలోగా కచ్చితంగా రెండు డోసుల టీకా తీసుకుంటే దర్శనానికి అనుమతి ఇస్తామని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రతిఒక్కరూ రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి.
దీక్షకు రెండు రోజుల ముందు..
అయ్యప్పస్వామి మాల ధరించాలి అనుకునే వారు రెండు రోజుల ముందు పవిత్రంగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరం గా ఉండాలి. ముఖ్యంగా మద్యం, మాంసాహారాలు తీసుకోరా దు. గోళ్లు, తలవెంట్రుకలు ముందే కత్తిరించుకోవాలి. దీక్ష తీసుకునే ముందు ఇంట్లో తల్లిదండ్రులు, పెళ్లి అయిన వారు భార్య అనుమతి తప్పకుండా తీసుకోవాలి.
కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష..
పవిత్రమైన కార్తీక మాసంలో అయ్యప్ప మాల దీక్షను తీసుకునేందుకు ఎంతో మంది ఇష్టపడుతారు. కార్తీక మాసంలో దీక్ష తీసుకొని స్వాములు మండల కాలాన్ని పూర్తి చేస్తారు. శ్రావణ మాసం తర్వాత అంతగా భక్తిశ్రద్ధలతో ప్రజలంతా కార్తీక మా సంలో అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. కార్తీక మాసంలో నో ములు, అయ్యప్ప స్వామి దీక్షలు చేపట్టి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
మాల వేసుకునే రోజు..
అయ్యప్ప మాల ధరించిన స్వాములు మండల కాలం పూర్తి చేసేందుకు బయట ఎక్కడైనా ఇండ్లు సమకూర్చుకోవాలి. గ్రా మాల్లో, పట్టణాల్లో స్వాములంతా కలిసి ప్రత్యేకంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ప్రత్యేకంగా పీఠం ఏర్పా టు చేసి దానిపై నూతన వస్ర్తాలు ఉంచి బియ్యం పోసిన గణపతి సుబ్రమణ్యం, అయ్యప్ప స్వామి చిత్ర పటాలను పెట్టాలి. చిత్రపటాలకు అలంకరణ చేసి ప్రతినిత్యం దీపారాధాన చేసి స్వామి వారికి పూజలు చేయాలి. ముందుగా గణపతి తర్వాత సుబ్రమ ణ్యం ఆ తర్వాత అయ్యప్పస్వామికి అష్టోత్తరాలను చదువుతూ పూజలు చేయాలి. పూజ ముగిసే వరకు మంచినీరు కూడా తాగరాదు. పూజ అనంతరం స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించాలి. అనంతరం మాల ధరించిన స్వాములకు సాష్టాంగ న మస్కారాలతో పాదాలు తీసుకోవాలి.
మాలధారణకు అవసరమ్యే సామగ్రి..
నల్ల లుంగీలు, ప్యాంట్లు, రెండు నల్ల చొక్కాలు, రెండు నల్ల కండువాలు, తులసీ మాల, రుద్రాక్షమాల, అయ్యప్ప స్వామి ముద్ర, కొబ్బరి కాయలు, అరటిపండ్లు, నువ్వుల నూనె, అగరవత్తులు, గంధపు పోడి, విభూతి, కుంకుమ, జీడిపప్పు, కిస్మిస్, వటిక, పంచదార, కర్పూరం సమకూర్చుకోవాలి. అలాగే అ య్యప్ప దీక్షను తీసుకునే వారు అవసరమైన సా మగ్రితో తెల్లవారకముందే గురుస్వామి వద్దకు వెళ్లి మాలధారణ చేసుకోవా లి. తల్లిదండ్రుల నుంచి కూడా మాలధారణ చేసుకోవచ్చు.
దీక్షా సమయం..
శబరిమలైలోని అయ్య ప్ప ఆలయాన్ని ఏటా వృ శ్చిక సంకలనం( నవంబర్లో) రోజు తెరుస్తారు. ఈ రోజు నుంచి దీక్షలు స్వీకరిం చే వారు మాలధారణ చేస్తుంటారు. జనవరి 1 నుంచి 20 వరకు మకర విళక్కు(మకర జ్యో తి ఉత్సవం) నిర్వహించి ఆలయా న్ని మూసివేస్తారు. మండల దీక్ష (41 రోజులు) చేపట్టేవారు నవంబర్ 16న మాలధారణ చేస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అయ్యప్ప మాలధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
నియమ నిష్టలు..
మాలాధారణ కార్యక్రమం తల్లి, గురుస్వామి ద్వారా జరుగాలి. అయ్యప్ప మాల తెగకుండా, నేలపై పడకుండా జాగ్రత్త వహించాలి. దీక్ష పూర్తయ్యే వరకు ఏ సమయంలోనూ రుద్రమాలను తీయరాదు. 41 రోజులు దీక్షలో ఉండాలి. నలుపు, నీలం రంగు దుస్తులు ధరించాలి. నిరంతరం శరణుఘేష తప్ప నిసరి. జాతి, మత, కుల వివక్షతతో సంబంధం లే కుండా ఎవరు బిక్షకు పిలిచినా వెళ్లాలి.
మెట్ల పూజ విశిష్టత..
మాల ధరించిన స్వామి కనీసం ఐదుగురు స్వా ములకు బిక్ష ఏర్పాటు చేయాలి. సామూహికంగా ప డి పూజలు చేస్తున్నారు. శబరిమలై అవకాశం అందరికీ ఉండకపోవడంతో పడి పూజ నిర్వహించి స్థలంలోనే అక్కడ ఎలా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయో అక్కడ కూడా చేస్తారు. 18 మంది గుణాల తో పోలి ఉన్న 18 మంది దేవతామూర్తులను మెట్ల రూపంలో పెట్టి పూజలు చేస్తారు.
స్వాములకు ఏడాదికో పేరు..
మాల ధరించిన వారిని సాక్ష్యాత్తు అయ్యప్ప స్వరూపంగా కొలిచి స్వామి అంటూ సంభోధిస్తారు. అయ్యప్ప స్వామికి మొ దటి సారి మాల ధరించిన స్వాములు అంటే మహాఇష్టం. అందుకే కన్నెస్వాములు తప్పకుండా శబరియాత్ర చేసి తీరాలి. ఏ టా ఒక్కోమెట్టు పైకి వెళ్లే స్వాములను ఆయా పేర్లతో పిలుస్తారు.
అయ్యప్ప స్వాముల పేర్లు
1 మొదటి సారి : కన్నెస్వామి
2.రెండో సారి : కత్తిస్వామి
ఇరుముడి ప్రత్యేకత..
అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ప్రత్యేకత ఉంది. దీక్ష తీసుకు న్న స్వాములు శబరిమలై ప్రయాణంలో మొదటి ఘట్టం ఇరుముడి, ఇరుముడి ధరించే అయ్యప్పస్వామి తెల్లవారుజామున ఇంటి గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి ఎవరితోనూ మాట్లాడకుండా ఆలయానికి వెళ్లి గురుస్వామితో ఇరుముడి కట్టించుకోవాలి. ఇరుముడితో శబరిమలై వెళ్లిన వారికి 18 మెట్లు ఎక్కే అర్హత లభిస్తున్నది.
మాల విరమణ..
అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి చేసుకున్నాక శబరియాత్రకు వెళ్లిన అయ్యప్పస్వాములు అక్కడే దీక్ష విరమిస్తున్నారు. ఇంకొందరు తిరుపతిలో మొక్కులు తీర్చుకొని అక్కడ విరమిస్తున్నారు. అలా కాకుండా శబరియాత్ర పూర్తయ్యాక దీక్ష పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి మాతృమూర్తి నుంచి మాల విరమించుకోవాలని గురుస్వాములు సూచిస్తున్నారు.