కృష్ణ, నవంబర్ 10: వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మ న్ రాజేశ్గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీపీ పూర్ణిమాపాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా ధర రూ.1960, బీ గ్రేడ్ సాధారణ మద్దతుధర 1940గా నిర్ణయించిందని, యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నా య పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ అనిల్ గాయత్రి, డైరెక్టర్లు అశోక్గౌడ్, శ్రీను, సలాం, శివకుమార్, సర్పంచ్ రాధ, రైతులు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, నవంబర్ 10: పీఏసీసీఎస్, ఐకేపీ, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బుధవారం మార్కెట్యార్డు ఆవరణలో మార్కెట్కమిటీ చైర్మన్ వీరారెడ్డి, పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో సర్జఖాన్పేట్ గ్రామంలో పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఐకేపీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు శోభారాణి ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మ ధుకర్రావ్, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ వరప్రసాద్, నాయకులు వేణుగోపాల్ తదితరులున్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, నవంబర్ 10: మండల కేంద్రంతోపాటు వత్తుగుండ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల సంస్థ అధ్వర్యంలో పీఏసీసీఎస్ అధ్యక్షుడు పుట్టి ఈదప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరు పండించిన ధాన్యాన్ని వారు మాత్రమే కేంద్రంలో విక్రయించాలని, ఇతరుల ధాన్యం తీసుకొచ్చి విక్రయించరాదన్నారు. తేమశాతం 17కు మిం చకుండా చూడాలని, ధాన్యంలో చెత్త లేకుండా తీసుకురావాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, నాయకులు సంజీవరెడ్డి, బసంత్రాజ్, విస్తరణ అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్లో..
మాగనూర్ నవంబర్ 10: మండల కేంద్రంలోని సింగిల్విండోలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్ మాగనూర్ ఉమ్మడి మండల పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రైతు శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని మఖ్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్ అన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు రాజు, జెడ్పీటీసీ, ఎంపీపీ శ్యామలమ్మ సీఈవో గోవర్ధన్, ఏవో రాధిక, వైస్ ఎంపీపీ దూల తిప్పయ్య తది తరులు పాల్గొన్నారు.
కోటకొండలో
నారాయణపేటరూరల్, నవంబర్ 10:నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కో టకొండ గ్రామైక్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హన్మ మ్మ, సుజాత, భీంషమ్మ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కాంటాకు పూజలు నిర్వహించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ సుమతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, నాయకులు వెంకట్నాయక్, రైతులు పాల్గొన్నారు.